Reporter -Silver Rajesh Medak. తేదీ 26-3-2024

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని మంగళ వారం జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ (స్థానిక సంస్థలు) సందర్శించారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, విద్యార్థులకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. త్రాగునీరు, కరెంట్ , మరుగుదొడ్లలో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనల పడకుండా పరీక్షలు జాగ్రత్తగా రాయాలన్నారు. పరీక్ష రాయడానికి వచ్చేటప్పుడు పరీక్ష అనంతరం ఇంటికి తిరిగే వెళ్లేటప్పుడు జాగ్రత్తగా రావాలని, తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను పరీక్ష కేంద్రానికి జాగ్రత్తగా పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!