హైదరాబాద్ :జూన్ 27
భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య జమున ఆరోపించారు. జమున మీడియాతో మాట్లాడుతూ.. “రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నట్లు తెలిసింది. ఈటలను చంపేస్తామంటే భయపడేది లేదు. కౌశిక్ రెడ్డి మాటల వెనక కేసీఆర్ ఉన్నారు. ఇలాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? రూ. 20 కోట్లు కాదు.. ఓటుతో ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్తారు. శాడిస్టులను పక్కన పెట్టుకొని కేసీఆర్ పాలన చేస్తున్నారు. కేసీఆర్.. కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్ లో అరాచకాలు సృష్టిస్తున్నారు” అని జమున ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!