మహానందిలో ముగిసిన అర్చకుల శిక్షణ తరగతులు..

స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 27, మహానంది:

రాష్ట్ర దేవాదాయ శాఖ అర్చక శిక్షణ కార్యక్రమం మహానంది క్షేత్రంలో గురువారం పూర్తయింది.రెండు రోజుల అర్చక శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి కడప,కర్నూలు జిల్లాల అర్చకులు షుమారు 250మంది పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో ముఖ్యంగా ఆలయాల్లో అర్చనావిధానం, మంత్ర,క్రియ,ముద్ర అనేటువంటి అనేక విషయాలపై క్షుణ్ణంగా నేర్పడమైనది.ముగింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని అర్చక వైభవాన్ని కొనియాడారు. అనంతరం అర్చక ట్రైనింగ్ అకాడమీ సహాయ కార్యదర్శి వేదాంతం చక్రవర్తి ని, రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు నందీశ్వరయ్య, రాష్ట్ర వీరశైవాగమ సలహాదారుడు శశిభూషన్ సిద్ధాంతి లను సన్మానించి పాల్గొన్న అందరికీ మహానందీశ్వరుని ప్రసాదం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!