మహానంది క్షేత్రంలో ఘనంగా వార్షిక పుష్కరోత్సవ పూజలు..

ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో గురువారం వార్షిక పుష్కరోత్సవము వైభవంగా నిర్వహించారు.ముందుగా క్షేత్రంలోని రాజగోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ల ఆధ్వర్యంలో గంగాదేవిని సాదరంగా ఆహ్వానించి ,అర్ఘ్యపాద్యాదులు సమర్పించి మంగళవాయిద్యాలు, వేదఘోషల నడుమ నందితీర్థం పుష్కరిణిలోకి పిలుచుకుని వచ్చి,రుద్రగుండం కోనేరులో విశేష చూర్ణాలతో అభిషేకించి, అలంకార హారతులు సమర్పించి, సంకల్ప పుష్కర స్నానం చేయించడమైనది. అనంతరం వేలాదిమంది కోనేరులో భక్తులుపుష్కర స్నానము ఆచరించారు.అనంతరం భక్తులు స్వామి అమ్మవార్ల ను దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించండం జరిగింది.ఈ కార్యక్రమం లో వేలాది సంఖ్య లో భక్తులు,స్థానికులు,ఆలయ సిబ్బంది,దాతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!