స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి శుచికరమైన భోజనం
మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం కూచారం కేజీ.బీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీలో ఆర్డీవో జై చంద్రారెడ్డి తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ రాజ్ ఈ.ఈ వర్షములతో కలిసి ‌కలెక్టర్ పాల్గొన్నారు.ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాలలో పరిశుభ్రత తో పాటు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల కు క్వాలిటీ విద్య అందేలా చూడడంతో పాటు భద్రతఫై ప్రత్యేక‌ దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.గురువారం మనోరాబాద్ మండలం కూచారం కేజీ.బీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీలో ఆర్డీవో జై చంద్రారెడ్డి తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ రాజ్ ఈ.ఈ నరసింహులు తో కలిసి ‌కలెక్టర్ పాల్గొన్నారు.కేజీ.బీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల‌లోని వంట గదులు వాష్ రూం లలో పరిశుభ్రతను పరిశీలించారు.స్టోర్ రూం ను స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.
విద్యార్థినిలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.విద్యార్థినిలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.మినరల్ వాటర్ అందుబాటులో ఉందా?మెను ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా ?అంటూ ప్రశ్నించారు. విద్యార్థినుల సానుకూల సమాధానం వ్యక్తం చేయడంతో‌ కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల కేర్ తీసుకోవడం జరుగుతుందని విద్యార్థినిలకు మెనూ ప్రకారం రుచి శుచికరమైన భోజనం అందుతుందన్నారు. నాణ్యమైన గుణాత్మక విద్య అందించి విద్యార్థినులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!