చేవెళ్ల:
ఈనెల 12న చేవెళ్ళ పట్టణంలో నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర కు హిందువులు పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేవైఎం జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి కోరారు. సోమవారం చేవెళ్ల మండల పరిధి గుండాల గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు శోభాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేవైఎం జిల్లా నాయకులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి కార్యకర్త నిష్టతో ధర్మం కోసం పనిచేయాని, హిందూ సంఘటితం కోసం నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర లో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని చాటాలన్నారు. పేద, ధనిక, నిమ్న ,అగ్ర వర్ణాల భేదం లేకుండా హిందువులంతా సంఘటితమై నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు శ్రీనివాస్, శ్రీశైలం, తిరుపతిరెడ్డి, బల్వంత్ రెడ్డి, కుమార్, లింగం తదితరులు పాల్గొన్నారు.
