స్టూడియో 10టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో పల్లె దావకానను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సంబంధిత ప్రజా ప్రతినిధులు వైద్యాధికారులు సిబ్బందితో కలిసి ప్రారంభించారు.ముందుగా ఆరోగ్య కేంద్రంలో బీపీ మిషన్ తో పరీక్ష చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి అనేదానికి నిదర్శనం అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 లక్షల రూపాయల వ్యయంతో పల్లె ధావకాన నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నారు నగరాలకు వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చుపెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని తెలిపారు.ఉచితంగా వైద్య పరీక్షలు మందులు పంపిణీ చేస్తారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రియ సంబంధిత ప్రజా ప్రతినిధులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.