Reporter -Silver Rajesh Medak.

తేదీ 28-3-2024 మెదక్

పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికలు నిర్వహణలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికముగా రద్దు చేయడం జరిగిందని, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!