మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ లో ఈనెల 13వ తేదీన నిజామాబాద్ కు చెందిన గౌతమి అనే మహిళ బస్సు ఎక్కుతున్న సమయంలో బ్యాగులో నుండి 10 తులాల బంగారు ఆభరణాల చోరీ జరిగింది.ఇట్టి విషయంపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితురాలు బొల్లారం శారద (50) గా గుర్తించి ఆమెను అదుపులోనికి తీసుకొని బంగారు ఆభరణాలను రికవర్ చేశారు. నిందితురాలును మేజిస్ట్రేట్ ముందు హాజరపరుస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి తెలిపారు. పది రోజుల్లో కేసును చెదించిన రామాయంపేట సీఐ వెంకటేష్ ఎస్సై రంజిత్ లను డిఎస్పి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!