అబ్బిపురంలో భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమం

స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 27, మహానంది:

చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ అని తెలుగుదేశం పార్టీ మండల కమిటీ మెంబర్ మౌలాబి అన్నారు.ఆదివారం మహానంది మండలం అబ్బిపురం గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి అధ్యక్షతన, మాజీ ఎంపిటిసి దస్తగిరి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారం లోకి రాగానే 18 ఏళ్లు నిండిన ప్రతి సోదరికి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేలు అందించనున్నారని తెలిపారు. అలాగే మహిళలకు దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేలు, నిరుద్యోగ యువతకు భృతి రూ.3 వేలు అందించనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి శ్రీశైలం నియోజకవర్గం మహాశక్తి కన్వీనర్ గంగాదేవి, మండల అధ్యక్షుడు ఉల్లి మధు,మాజీ ఎంపీటీసీ దస్తగిరి, ఈర్నపాడు లక్ష్మిదేవి, హరి ప్రసాద్ రెడ్డి, చల్లా శ్రీను వడ్డే సుబ్బారాయుడు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!