టీడీపీతోనే రాష్ట్రంలో ప్రజల భవిష్యతుకు గ్యారెంటీ

స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 26, మహానంది:

టీడీపీతోనే రాష్ట్రంలో ప్రజల భవిష్యతుకు గ్యారెంటీ ఉంటుందని మండల టిడిపి అధ్యక్షుడు ఉల్లి.మధు అన్నారు.శనివారం మహానంది మండలం శ్రీనగరం గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలను ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన మ్యానిఫెస్టోలో చేయూత నిస్తుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం మహాశక్తి కన్వీనర్ గంగాదేవి,గోపవరం మాజీ మండల అధ్యక్షురాలు చింతం నాగమణి,శ్రీనగరం గ్రామ కమిటీ సభ్యులు పి.రంగమ్మ,ఇయర్నపాడు లక్ష్మి,డి. హుస్సేన్ బి,గ్రామ నాయకులు వై.హరిచంద్ర ప్రసాద్, షేక్ అబ్దుల్, పి. వెంకటేశ్వర్లు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!