భక్తులకు మహానందీశ్వరుని నిరంతర నిజరూప దర్శన భాగ్యం..

-ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 25, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రావణ శుద్ధ ఏకాదశి 27-8-2023 వ తేదీ నుండి మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులకు మహానందీశ్వరుని నిజరూప దర్శనం నిరంతరాయంగా కొనసాగించేవిధంగా చర్యలు తీసుకున్నట్లుగా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి,పాలక మండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి లు
శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ శని,ఆది,సోమవారములు మరియు పర్వదినములలో ఉదయం 7-30నుండి11-00వరకు మిగిలిన రోజుల్లో ఉదయం 7-30నుండి9-30వరకు మాత్రము పంచామృతాభిషేకం చేసుకొనుటకు ఏర్పాటు చేస్తూ,మిగిలిన సమయాల్లో శుద్ధమైన ఆవుపాలు&స్వఛ్ఛమైన గంగనీరుతో అభిషేకం చేసుకొనుటకు,మరియు గర్భాలయ దర్శనం కూడా నిరంతరం నిజరూప దర్శనం ఉండేవిధంగా ఏర్పాటు చేశము అన్నారు. అంతేకాకుండా
ఆదివారం నుంచి క్షేత్రం లో లడ్డు, పులిహోరలతో పాటు వడ ప్రసాదమును భక్తులకు అందుబాటులోకి తేవడమైనది అన్నారు. కావున భక్తాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని స్వామి అమ్మ వార్ల కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ పండితులు, అర్చకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!