మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ.33,
21లక్షలు

స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 19, మహానంది:

మహానంది క్షేత్రంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.33,21,500 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లో భక్తులు 35 రోజులపాటు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బందితో లెక్కించామన్నారు. ఇందులో స్వామి, అమ్మవారి ఆలయాలలోని హుండీలతోపాటు ఇతర హుండీలను లెక్కింపు నిర్వహించగా రూ.33,21,500 లక్షలు వచ్చిందని అన్నారు.ఆలయాల ద్వారా 32,33,140వేలు,అన్నదానం హుండీ ద్వారా రూ.68,144 వేలు,గోసంరక్షణ రూ.20,216వేలు,
యూఎస్ఏ 1 డాలర్-2,యూఎస్ఏ 20 డాలర్-1,
యూఎస్ఏ 10 డాలర్1- బంగారం 47 గ్రాముల-300 మీ.గ్రాములు, వెండి 680 గ్రాముల100మీ.గ్రాములు వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా తరుపున వెలుగోడు గ్రూప్ టెంపుల్స్ ఈవో జనార్దన్ శెట్టి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలోని బాలాజీ కృష్ణ దత్త సాయి సేవకులు, ఆలయ అధికారులు ,సిబ్బంది, పండితులు, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!