అంగరంగ వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు…

స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 30, మహానంది:

మహానంది పుణ్య క్షేత్రంలో ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయిన శ్రీ వాసవాంబ జయంతి సందర్భంగా క్షేత్రం లోని వాసవి సత్రం నుండి ముందుగా ఆర్యవైశ్య మహిళలు వాసవి మాత చిత్ర పటాన్ని విశేషంగా అలంకరించి చేత పట్టుకొని అదేవిధంగా కలిశాల తో రుద్రగుండము కోనేరు లోని జలము ను తీసుకొని క్షేత్రంలోని మాడవీధుల గుండ ప్రదక్షణం చేసి ఆ నీటితో గరుడ నందీశ్వరునికి అభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆర్యవైశ్య మహిళలు వాసవి సత్రం నందు వాసవి మాత చిత్రపటానికి పంచామృత అభిషేకము, అర్చనలు, కుంకుమార్చనలు మహా మంగళహారతి వంటి కార్యక్రమాల ను పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య మహిళలలు కుంకుమ అర్చన కార్యక్రమాన్ని నిర్వహించి, మహిళలు వాసవి మాత గీతాలను ఆలపించారు. పరమేశ్వరి అవతారమైన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ఆర్యవైశ్య మండల మహిళా సంఘం, ఆర్యవైశ్య సత్రం కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రం లో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల మహిళా అధ్యక్షురాలు మునగనూరు శ్రీలక్ష్మి,, మాజీ మండల అధ్యక్షులు మునగానూరు రమేష్,మహిళా మండలి మహిళలు,పెద్ద సంఖ్యలో గ్రామ అర్యవైశ్య మహిళలు ,భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!