ఉరుసు మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే శిల్పా

స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 28, మహానంది:

మహానంది మండలం నందిపల్లి గ్రామంలోని హాజరత్ మాదర్ వలి ఉరుసు మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉరుసు మహోత్సవంలో పాల్గొని హజరత్ మదర్ వలి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించుకున్నారు.అనంతరం ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించుకున్నారు.ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని, మహానంది దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి, వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!