జిల్లా లోని రెండు నియోజకవర్గాలలో ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 1571 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాజర్షి షా.

జిలా సమీకృత కలెక్టరేట్ సముదాయములో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో 274 , స్థానిక డిగ్రీ కళాశాల, ,ఆర్ డి ఓ కార్యాలయములో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో 364, నర్సాపూర్ ఆర్డీ ఓ కార్యాలయము , ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో 336 మంది ఎన్నికలసిబ్బంధి తమ ఓటు ను వినియోగించుకున్నారని తెలిపారు.

గురువారం జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాలలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో 597 మంది ఓటర్లు వారి ఓటు హక్కు ను వినియోగించుకున్నారని తెలిపారు . మొత్తంగా 1571 ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!