నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరుతున్నారు.

బుధవారం హవేలి ఘనపూర్ మండల పరిధిలోని కుచన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మెదక్ ఎమ్మెల్యే సమక్షంలో BRS లో చేరారు. కాంగ్రెస్ నాయకులు నాలుగో వార్డ్ సభ్యులు దుర్గారి ఎల్లవ్వ,ఇర్ల కిషన్,CITU రాష్ట్ర కార్యదర్శి తలారి సంజీవులు,అరిక రాములు, దుర్గారి రమేష్, లింగాల అనిల్, సంపత్, చింతకింది మల్లేశం, శతెల్లి శ్రీనివాస్, తొగిట వెంకట్ వీరితోపాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యకర్తలకు అండగా ఉంటా…

గ్రామ వార్డు సభ్యులు ఆకుల యాదగిరి తండ్రి వెంకట్ ఇటీవల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి జారిపడ్డారు. ఈ ప్రమాదంలో వెంకట్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. వెంకట్ ఇంటికి బుధవారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెళ్లి పరమశించారు. వెంకట్ కు అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, PACS చైర్మన్ హనుమంత్ రెడ్డి, మెదక్ మాజీ ZPTC ఆంజనేయులు,BRS నాయకులు మాణిక్య రెడ్డి, కొంపల్లి సుభాష్ రెడ్డి,BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, గ్రామశాఖ అధ్యక్షులు తోగిట మళ్లయ్య, వార్డ్ మెంబెర్స్ కుర్మబయ్యన్న , ఆకుల యాదగిరి, మన్నే యాదగిరి మరియు గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!