హైదరాబాద్:జూన్ 27
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా సోలిపేట పని చేశారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో సొలిపేట పనిచేశారు. సొలిపేటకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనిలో నివాసం ఉంటోంది. అక్కడే ఆయన కన్నుమూశారు. ప్రజలు, నేతల సందర్శనార్ధం సొలిపేట రామచంద్రారెడ్డి భౌతికకాయాన్ని నివాసం వద్దే ఉంచనున్నారు. ఈరోజు సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సొలిపేట మరణవార్త తెలిసి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!