మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం: ఈడీ

హైదరాబాద్‌ : తెలంగాణ మెడికల్‌ కాలేజీల్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సోదాలు జరిపామని తెలిపింది.. మంత్రి మల్లారెడ్డి కాలేజీలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. రూ. కోటి 40 లక్షలు నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని రూ. 2.89 లక్షలు అనధికార నగదు సీజ్‌ చేసినట్లు తెలిపింది. ‘హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల్లో సోదాలు నిర్వహించాం. వరంగల్‌ పీజ మెడికల్‌ సీట్స్‌ స్కామ్‌పై కేసు నమోదు చేశాం. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపాం. ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం’ అని ఈడీ పేర్కొంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!